సవ్వడి
భాషలాగే సంస్కృతి కూడా నిరంతరం మారుతూనే ఉంటుంది. ఆ మార్పును ఆపలేము, ఆపకూడదు కూడా. ఎటొచ్చీ సంస్కృతిని మర్చిపోకుండా ఉండే ప్రయత్నమే మనం చేయగలం. ఆ భగీరధ ప్రయత్నాన్ని భుజాల మీద వేసుకొన్న అరుదైన వ్యక్తులు కొందరు కనిపిస్తారు. శ్రీ బద్రి కూర్మారావు గారు, శ్రీ స వెం రమేశ్ లాంటి వారు అలాంటి కోవకే చెందుతారు.
