సాహిత్యం
తెలుగు సాహిత్యంలో మొదటి నుంచి, సంస్కృతమే సింహభాగం, తెలుగు పాళ్లు తక్కువే. అలా అని నిరుత్సాహపడనవసరం లేదు.
పొనగంటి తెలగన్న, పాల్కురికి సోమనాధుడు, కూచిమంచి తిమ్మకవి లాంటి కవులు పూర్తీగా తెలుగులోనే రచన సాగించారు. తెలుగు శతకాల్లో వేమన శతకం, సుమతీ శతకాల్లో తెలుగుకు చక్కని స్థానమే దొరికింది. తిక్కన, పోతన లాంటి కవులు తమ రచనల్లో తెలుగును మంచిగానే వాడినారు.
