తెలుగు సాహిత్యంలో మొదటి నుంచి, సంస్కృతమే సింహభాగం, తెలుగు పాళ్లు తక్కువే. అలా అని నిరుత్సాహపడనవసరం లేదు.
పొనగంటి తెలగన్న, పాల్కురికి సోమనాధుడు, కూచిమంచి తిమ్మకవి లాంటి కవులు పూర్తీగా తెలుగులోనే రచన సాగించారు. తెలుగు శతకాల్లో వేమన శతకం, సుమతీ శతకాల్లో తెలుగుకు చక్కని స్థానమే దొరికింది. తిక్కన, పోతన లాంటి కవులు తమ రచనల్లో తెలుగును మంచిగానే వాడినారు.
అన్నమయ్య కీర్తనల్లో రాయలసీమ తెలుగును బాగా చూడవచ్చు. ఆదిభట్ల నారాయణదాసు, మారేపల్లి రామచంద్రశాస్త్రి లాంటివారు సంస్కృతంలో ఉన్న అధ్యాత్మిక సంపదను తెలుగులోకి మార్చారు.
ఇవేకాక మన జానపదాలు అంతా పోతపోసిన తెలుగు. ఇదంతా కూడా మేలిమి సాహిత్యమే.
మన మేలిమి తెలుగు గ్రంధాలయంలో తెలుగు పుస్తకాలు బాగానే ఉన్నాయి. మీకు నచ్చిన పుస్తకం కోసం మేలిమి తెలుగు గ్రంధాలయం చూడండి.