పలుకుబడి
తెలుగు పలుకుబడిలో మొదటి నుంచి సంస్కృత పెత్తనమే ఎక్కువ, తెలుగు పాళ్లు తక్కువే. అలా అని క్రుంగవలసినక్కఱలేదు.
పొనగంటి తెలగన్న, పాల్కురికి సోమనాధుడు, కూచిమంచి తిమ్మకవి లాంటి వ్రాయికర్లు పూర్తీగా తెలుగులోనే తమ అల్లికలు సాగించారు. తెలుగు నూఱాదిల్లో వేమన నూఱాది, సుమతీ నూఱాదిల్లో తెలుగుకు చక్కని తావే దొరికింది. తిక్కన, పోతన లాంటి కవులు తమ అల్లికల్లో తెలుగును మంచిగానే వాడినారు.
